
తుంగతుర్తి, హాలియా, మేళ్లచెరువు, హుజూర్నగర్, నార్కట్పల్లి, దేవరకొండ, వెలుగు : భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. రెవెన్యూ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు..
భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం వెలమగూడెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ పాస్బుక్ లో ఏవైనా తప్పులుంటే సవరించుకోవచ్చని చెప్పారు. ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు మేళ్లచెరువు, హుజూర్నగర్, నార్కట్పల్లి, దేవరకొండ మండలాల్లోని పలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సలు
నిర్వహించారు.